Most Recent

సర్వ శక్తిమంతుడు.. చైనా అధ్యక్షుడు... బలోపేతం చేసేందుకు పార్టీ నిబంధనలకు సవరణలు
బీజింగ్‌: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను ‘మరో మావో’ను చేయాలన్న లక్ష్యంతో అధికార కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఆ పార్టీ ఆరో ప్లీనరీ సమావేశాల్లో జిన్‌పింగ్‌ను మరింత శక్తిమంతున్ని చేసేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పార్టీ కేంద్ర కమిటీకి చెందిన సుమారు 370 మంది శాశ్వత, ప్రత్యామ్నాయ సభ్యులు హాజరుకానున్నారు. కఠిన క్రమశిక్షణాయుత పార్టీ నిర్వహణ, అంతర్‌ పార్టీ పర్యవేక్షణ, పార్టీలో రాజకీయ జీవితం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయని ప్రభుత్వ ఆధీనంలోని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. జిన్‌పింగ్‌ అధ్యక్షతన ఉన్న ఏడుగురు సభ్యుల స్థాయీ సంఘమే వాస్తవానికి దేశాన్ని పాలిస్తుంది. అందులో జిన్‌పింగ్‌, మరొకరు మినహా మిగిలిన అయిదుగురు సభ్యుల వయసు 68 ఏళ్లు నిండుతుంది. వారిని కొనసాగించాలంటే పార్టీ నిబంధనలను సవరించాల్సి ఉంటుంది. లేదంటే వారి స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. జిన్‌పింగ్‌కు 63 ఏళ్లు వచ్చినప్పటికీ, అధ్యక్షునికి పదేళ్ల కాలపరిమితి ఉండాలన్న నిబంధన మేరకు ఆయన 2022 వరకు కొనసాగనున్నారు. ఆయనను మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ‘ఉమ్మడి నాయకత్వ’ నిబంధనను సవరించాలని, 2022 తరువాత కూడా ఆయనను కొసాగించాలని ప్రతిపాదించారు.1980 నాటి నిబంధనలను సవరించనున్నారు. హాంగ్‌కాంగ్‌లో వచ్చే ఏడాది పార్టీ కాంగ్రెస్‌ జరగనున్న దృష్ట్యా ముందుగానే ఈ విషయాలపై స్పష్టత వచ్చేలా ప్రస్తుత సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. వ్యూహాత్మక సవాళ్లు ఎదురవుతున్న ప్రసుత తరుణంలో జిన్‌పింగ్‌లాంటి గట్టి నాయకుడు అవసరమని పార్టీ వర్గాలు అభిప్రాపడుతున్నాయి.
అవినీతిపై కఠిన చర్యలు: అవినీతిపై కఠినంగా వ్యవహరించనున్నట్టు పార్టీ క్రమశిక్షణ, పర్యవేక్షణ
సంఘం తెలిపింది. 2013 నుంచి గత నెల వరకు అవినీతికి పాల్పడ్డ దాదాపు పది లక్షల మంది అధికారులపై చర్యలు తీసుకున్నట్టు నివేదిక వెలువరించింది. జిన్‌పింగ్‌ చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యలు ఆయనకు ప్రజల్లో మంచిపేరు తీసుకురావడమే కాకుండా, పార్టీలోని ఆయన వ్యతిరేకులకు ముకుతాడు వేసేలా చేసింది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల మద్దతు పొందడం రాజకీయంగా ప్రాధాన్యంగల అంశమని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు.

Unknown Tuesday 25 October 2016
2016 Kabaddi World Cup: Ruthless Iran thrash Thailand by 62-23..

Ahmedabad, Oct 10: Iran continued their impressive run at the ongoing 2016 Kabaddi World Cup with a comfortable 64-23 win over Thailand in a rather one-sided Group B match here on Sunday (Oct 9). Your complete guide to Kabaddi World Cup 2016: Groups, fixtures, dates Iran produced a masterclass performance in kabaddi as they thrashed minnows Thailand in the eighth match of the tournament. The result was never in doubt, as Thailand had no answer to the superiority of their opponents.

Iran, on the other hand, underlined their credentials as title contenders with a second consecutive victory. Iran inflicted six all outs on Thailand and look like the team to beat in the World Cup as they sit atop Group B with 10 points. Thailand were trailing 0-2 after two minutes, but Santi Bunchoet came up with a brilliant raid to level the game at 2-2 after three minutes. But Pro Kabaddi star Meraj Sheykh scored with a two-point raid in the fifth minute to give Iran a 6-2 lead. Thaliand forced a super tackle through Jantajam Peercdach as they trailed 4-6. Iran inflicted the first all out of the match in the eighth minute to lead 12-4. 



Thailand's raiders found it difficult to cope with the physically strong Iranian defence in the first half. Iran led 16-6 after 11 minutes and Mohammed Ishmael made it 18-6 and reduced Thailand to just one man. An all out was duly inflicted as Iran started to dominate the proceedings and led 21-6 after just 13 minutes. Fazel Athrachali and Soleiman Pahlevani scored five points each in the first half whereas Meraj Sheykh also contributed four raid points for Iran. Thailand's inexperience was evident as the match wore on and Iran inflicted another all out in the 17th minute to lead 30-6. Such was Iran's dominance that Thailand scored a single point in the last nine minutes of the first half. Iran ended the first half with a formidable 27-point gap and led 34-7. It was a one-sided affair in the second half as well as Iran continued to dominate and led 38-8 after 24 minutes. Iran inflicted the fourth all out of the match in 25th minute to lead 42-8. Thailand were unable to match the agility of Iran's attack and defence as the mighty Iranians handed them a lesson in kabaddi. Things got worse for Thailand as they suffered sixth all out in th 35th minute and trailed 11-62. Thailand, however, redeemed some pride as they inflicted an all out in the 38th minute and trailed 21-64. Meraj Sheykh was the most impressive raider for Iran and scored eight points whereas Soleiman Pahlevani also got eight points. The highest scorer for Iran, however, was Farhad Milaghardan who ended the match with 10 points.


Unknown Sunday 9 October 2016
Indore Test: Virat Kohli joins elite company with Don Bradman, Brian lara..

Indore, Oct 10: India's star batsman Virat Kohli, with his double century against New Zealand, has joined an elite company of Test captains that includes the legendary Don Bradman. Match scorecard On Sunday (October 9), Kohli registered his highest Test score of 211 in the 3rd and final Test of the series at the Holkar Stadium.

This was the skipper's 2nd double century of his career. His previous double ton was against the West Indies in July this year. The 27-year-old Kohli, with his 2nd double ton in Tests, has joined a select band of captains to have hit 2 or more double centuries in the same calendar year. Australian legend Bradman was the first ever captain to achieve the feat. Michael Clarke (4 times), Greg Chappell, Brian Lara and Brendon McCullum are the other 4 in the list. For Kohli, it was his 13th Test century in 48th match. He made his debut in 2011 and captained India for the first time in 2014.
 4 - 2012 - 329 not out Vs India, 210 Vs India, 259 not out Vs South Africa, 230 Vs South Africa 2. Don Bradman (Australia) - 1937 - 270 Vs England, 212 Vs England 3. Greg Chappell (Australia) - 1981 - 204 Vs India, 201 Vs Pakistan 4. Brian Lara (West Indies) - 2003 - 209 Vs Sri Lanka, 202 Vs South Africa 5. Brendon McCullum (New Zealand) - 2014 - 224 Vs India, 302 Vs India 6. Virat Kohli (India) - 2016 - 200 Vs West Indies, 211 Vs New Zealand


Unknown
కోహ్లీ డబుల్ సెంచరీ రికార్డు, రహానె మిస్: చివరలో రోహిత్, భారత్ 557
ఇండోర్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తొంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 211(271 బంతుల్లో 20×4) పరుగులు చేసి ఔటవగా, డబుల్ సెంచరీకి కొద్ది దూరంలో మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అజింక్య రహానె 188(254 బంతుల్లో 18×4, 4×6) పరుగుల వద్ద వెనుదిరిగాడు.
కాగా, ఓవర్‌నైట్‌ స్కోరు 267/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ లంచ్‌ విరామానికి 358/3తో నిలిచింది.మొత్తంగా నాలుగో వికెట్‌కి విరాట్‌ కోహ్లీ-రహానె జోడి 365 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, హెన్రీ విసిరిన ఓ బంతి రహానె హెల్మెట్‌కు బలంగా తాకడంతో కాసేపు భారత్‌ శిబిరంలో కంగారు మొదలైంది. అయితే ఈ సంఘటన అనంతరం రహానె బ్యాటింగ్‌లో దూకుడు పెంచాడు. 557 భారత్ డిక్లేర్ భారత్ 5 వికెట్లు కోల్పోయి 557 పరుగులకు తొలి ఇన్నింగ్ డిక్లేర్ ప్రకటించింది. కాగా, రోహిత్ శర్మ ధాటిగా ఆడి అర్ధ శతకం(63బంతుల్లో 51 పరుగులు, 3 ఫోర్లు, 2సిక్సర్లు) పూర్తి చేశాడు. జడేజా 27 బంతుల్పలో 17 పరుగులు చేశాడు. కివీస్ తొలి ఇన్నింగ్స్ ఓపెనర్లుగా వచ్చిన గుప్తిల్ 10, లాథమ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. కోహ్లీ డబుల్ సెంచరీ రికార్డు మూడో టెస్టులో కెప్టెన్‌ కోహ్లి డబుల్ సెంచరీ సాధించాడు. మొత్తం 347 బంతుల్లో కోహ్లి 18×4 సాయంతో 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్‌పై విరాట్‌ కోహ్లి ఓ డబుల్ సాధించాడు. భారత్‌ టెస్టు కెప్టెన్‌ రెండు ద్విశతకాలు చేయడం చరిత్రలో తొలిసారి. ఆ నలుగురి తర్వాత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉంటూ అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్లలో ఇప్పటికే ధోనీని అధిగమించేసిన విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్ జట్టుపై తాజా సెంచరీతో టైగర్ పటౌడీని దాటేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా ఉన్నాడు. కెప్టెన్‌గా ఆరు సెంచరీలు చేసిన కోహ్లీకన్నా ముందు ముగ్గురు మాత్రమే ఉండగా.. వీరిని అధిగమించి, తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పేందుకు కోహ్లీకి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు. కాగా, భారత జట్టు కెప్టెన్లుగా ఉండి సెంచరీలు సాధించిన వారిలో గవాస్కర్ (11) అగ్రస్థానంలో ఉండగా, ఆపై అజారుద్దీన్ (9), సచిన్ (7) శతకాలతో ఉన్నారు. కోహ్లీ మరో ఐదు సెంచరీలు చేస్తే, వీరందరి రికార్డులూ పటాపంచలవుతాయి.


Unknown
Intelligence Bureau picks up 'Make India Bleed' chatter from Pakistan..

"Make them bleed"-this is what the Intelligence agencies in India managed to pick up while listening to the chatter between a terrorist group in Pakistan with their handlers. In the past week, the Intelligence Bureau has been issuing regular updates on possible terrorist strikes that Pakistan based groups are planning in India. The Intelligence Bureau says that the targets are likely to be big cities and this is a ploy on the part of the Jihadi groups.

"For now the entire security mechanism is focused on the Indo-Pak border and also on Jammu and Kashmir. Terrorist groups would look to use this as a diversionary tactic and attempt a major strike in India," IB officials also tell OneIndiia. Make them bleed The army and the ISI in Paksitan, who were given the bloody nose by the Indian armed forces recently, are desperate to prove a point and hit back. They will sanction as many strikes as possible and go all out to aid the terrorists.

Officials in India say that the recent stand-off between the civilian government and the military as reported in a section of the media is not correct. The civilian government is said to have told the military and the ISI to reign in on the Lashkar-e-Taiba and the Jaish-e-Mohammad fearing international isolation. This, according to Indian officials, is nothing but an eye wash. "Such news was floated to hoodwink the international community," officials also say. For now, the information that is being picked up from Pakistan suggests that a major attack is being planned. The generals want to have the last word. The recent visit by General Raheel Sharrif to the Line of Control is also another diversionary tactic to make India believe that there would be retaliation on the border. IB officials say that Pakistan may try and hit a major target in India or attempt a hijack. They would sanction the Jaish-e-Mohammad for this hit as the group is known to carry out major fidayeen attacks. The IB has already advised the police in major cities to be on high alert.


Unknown
కళ్లు తెరిచిన జయ: తనకేమైందంటూ సైగలతో ప్రశ్న!

చెన్నై: గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ఆమె కోసం తపన పడుతున్న అందరినీ సంతోషానికి గురిచేశారు. అస్వస్థత కారణంగా 18 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్న జయలలిత ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అన్నాడీఎంకే సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. డాక్టర్‌ శివకుమార్‌ నేతృత్వంలోని అపోలో వైద్యబృందం, లండన వైద్యుడు డాక్టర్‌ జాన రిచర్డ్‌ బీలే, ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు ఇచ్చిన చికిత్సతో ఆమె కోలుకుంటున్నారని తెలిపాయి. వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న జయ.. ఆదివారం మధ్యాహ్నం కళ్లు తెరవడంతో పాటు మెల్లిగా వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం. అంతేగాక, వైద్యులను తనకేమైందంటూ సైగలతో జయలలిత ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వార్త మంత్రులకు అన్నాడీఎంకే కార్యకర్తలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దీంతో పదిరోజుల తర్వాత పార్టీ వర్గాల్లో కొంత ఉత్సాహం కనిపించింది. కాగా, జయకు రక్తపోటు, చక్కెర శాతం సాధారణ స్థితికి వచ్చాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వారం రోజుల్లో ఆమెను ఇంటికి పంపించే అవకాశముందని అపోలో వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. అమ్మ త్వరలోనే తిరిగివస్తోందంటూ ఆనందపడిపోయారు.ఇది ఇలా ఉండగా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి, సీపీఐ జాతీయ నేత డి.రాజా, టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన తదితరులు అన్నాడీఎంకే సీనియర్‌ మంత్రులు, వైద్యులతో మాట్లాడి జయ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. జయలలిత చికిత్స స్పందిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలోనే ఆమె ఆరోగ్యంగా తిరిగి వస్తారని చెప్పారు. కాగా, జయలలిత త్వరగా కోలుకోవాలంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. కాగా, ఆపద్ధర్మంగా ఉపముఖ్యమంత్రిని నియమించాలన్న ఆలోచనపై అన్నాడీఎంకే ఒక నిర్ణయానికి వచ్చింది. పరిపాలనాపరమైన కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతున్నందున డిప్యూటీ సీఎం అవసరం లేదని ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది.




Unknown
సెలబ్రిటీ అంటే ఇంతే మరి, సల్మాన్ ఖాన్ కి వంద కోట్ల పరువు నష్టమట...

మొగున్ని కొట్టి మొగసాలకెక్కటం అనే సామెత విన్నారు కదా ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసే పని చూస్తే అలానే అనిపించింది. 18 ఏళ్ల క్రితం సల్మాన్ కృష్ణజింకల వేట కేసులో అసలు నిజం ఏమిటన్నది బహిరంగ రహస్యమే అని అనుకునే వారే ఎక్కువ. కానీ కోర్టు లో వచ్చిన తీర్పుని గౌరవించి తీరాలి కాబట్టి సల్మాన్ విషయం లో ఎవరూ అతన్ని దోషి గా నిరూపించే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ విషయం లో సల్మాన్ పాత్ర పై మరిన్ని ఆధారాల కోసం ఈ ఉదంతంపై ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ వీడియోలో సల్మాన్ వేటాడుతుండగా చూశామని కొందరు చెప్పారు. అయితే తర్వాత వారు మాట మార్చి తాము అలా అనలేదని, తమ మాటలు వక్రీకరించి, వేరే అర్ధం స్ఫురించేలా వీడియో ఎడిట్ చేశారని వివరించారు. ఇక, ఈ కేసు నుంచి పూర్తిగా విముక్తి లభించడంతో స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన ఛానల్ను ఇరుకున పెట్టేందుకు సల్లూభాయ్ పరువునష్టం దావా వేశాడు. తన ప్రతిష్టకు భంగం కలుగజేసిన ఛానల్ రూ.100కోట్లు చెల్లించాలని బోంబే హై కోర్టును ఆశ్రయించాడు. అదన్న మాట సంగతి. నిజమేమిటో చాలామందికి అర్థం చేయించాలనుకున్న ఆ చానల్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. సల్మాన్ నిర్దీషిగా నిరూపించబదటమే కాదు. ఇప్పుడు నిజం బయటికి తీయాలనుకున్న చనల్ కే ఒక సమస్యని తెచ్చిపెట్టాడు
రూ.100కోట్ల పరువు నష్టం కోరుతూ సల్మాన్ ఖాన్ ఆగస్టులోనే కోర్టుకెళ్లాడు. స్టింగ్ ఆపరేషన్ తనపై బురద జల్లేందుకే తీశారని వ్యాజ్యంలో పేర్కొన్నాడు. స్టింగ్ ఆపరేషన్లో భాగంగా షూట్ చేసిన ఫుటేజ్ను ధ్వంసం చేయాలని, భవిష్యత్లో ఆ వీడియోలకు సంబంధించిన దృశ్యాలు ఎక్కడా ప్రసారం కాకుండా చూడాలని సల్మాన్ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఈ కేసు నవంబర్ 18న విచారణకు రానుంది. ఇదిలాఉంటే, ఈ పిటిషన్ దాఖలైనప్పుడే తాము సల్మాన్పై చేసిన శూలశోధన దృశ్యాలను ధ్వంసం చేశామని సదరు టీవీ ఛానల్ ఇటీవలే తెలిపింది. స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన వీడియోలేవీ తమ వద్ద లేవని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో సల్మాన్ పార్టీ కోర్టు బయటే రాజీ కుదుర్చుకోవాలని యత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి, 'భజరంగీ భాయ్జాన్" పరువు నష్టం కథ ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలి మరి.


Unknown
10 సంప‌న్న న‌గ‌రాల్లో రెండు తెలుగు న‌గ‌రాలు.
అంత‌ర్జాతీయంగా భార‌త్ పేరు రోజురోజుకీ విస్త‌రిస్తోంది. జ‌నాభాలో రెండో అతిపెద్ద దేశ‌మైన ఇండియా ఆర్థిక వ్య‌వ‌స్థ స్థిరంగా పెరుగుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ నేప‌థ్యంలో జీడీపీ ప‌రంగా దేశంలో 10 ప్ర‌ముఖ న‌గ‌రాల‌ను తెలుసుకుందాం. హెల్లోట్రావెల్ వెల్ల‌డించిన ఈ ప‌ది న‌గ‌రాల వివ‌రాలు ఇక్క‌డ చూడండి.

ముంబయి

దేశ ఆర్థిక రాజ‌ధానిగా వెలుగొందుతున్న ముంబ‌యి అత్య‌ధిక ధ‌నిక న‌గ‌రం. మ‌హారాష్ట్ర రాజధాని అయిన‌టువంటి ఈ న‌గ‌రం ప్ర‌పంచంలోనే రెండో అత్యంత జ‌న స‌మ్మ‌ర్థం క‌లిగిన న‌గ‌రం. దీని ప్ర‌స్తుత జ‌నాభా 1 కోటి 30 ల‌క్ష‌ల‌కు పైగా ఉంటుంది. పారిశ్రామిక రంగంలో దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగాల్లో 10 శాతం ఈ న‌గ‌రం నుంచే ల‌భిస్తున్నాయి. దేశానికి ఎగుమ‌తి ప‌న్ను 20 శాతం ఇక్క‌డ నుంచే వ‌స్తోంది. ముంబై న‌గ‌ర త‌ల‌స‌రి ఆదాయం దాదాపు రూ. 49 వేలు.
ఇది జాతీయ త‌ల‌స‌రి ఆదాయం కంటే మూడింత‌లు ఎక్కువ‌. ప్ర‌ముఖ స్టాక్ ఎక్స్చేంజీలైన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఆర్‌బీఐ ప్ర‌ధాన కార్యాలయాలు ఇక్క‌డే ఉన్నాయి. ఈ న‌గ‌ర డీజీపీ 209 బిలియ‌న్ యూఎస్ డాల‌ర్లుగా ఉంటుంద‌ని అంచ‌నా.

ఢిల్లీ

భార‌త‌దేశ రాజ‌ధాని ఢిల్లీ. ఆర్థికంగా సంప‌న్న‌మైన న‌గ‌రాల్లో ఢిల్లీ ఒక‌టి. ఢిల్లీ నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిటొరీ ప్రాంతంలో ఉన్న కార్లు మ‌రే న‌గ‌రంలో ఉన్న కార్ల కంటే ఎక్కువ‌. ఈ న‌గ‌ర జీడీపీ 167 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చు. రిటైల్ మార్కెట్‌లో ఎంతో ప‌ట్టుగ‌లిగిన ఈ ప్రాంతం ఎక్కువ ఎఫ్‌డీఐల‌ను ఆక‌ర్షిస్తోంది. దిల్లీ జీడీపీలో సింహ భాగం సేవా రంగం నుంచే వ‌స్తోంది. ఇత‌ర ముఖ్య రంగాలు ఐటీ, హోట‌ళ్లు, బ్యాంకింగ్‌, మీడియా, ప‌ర్యాట‌కం. ఎస్ అండ్ పీ సీఎన్ఎక్స్ 500 సూచీలోని వాణిజ్య సంస్థ‌ల‌లో 12% సంస్థ‌ల ప్ర‌ధాన కార్యాల‌యాలు ఢిల్లీ న‌గ‌రంలో ఉన్నాయి.

కోల్‌క‌త‌

ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని అయినటువంటి కోల్‌క‌త‌కు ఎంతో చారిత్ర‌క ప్రాధాన్యం ఉంది. ఈ నగ‌రం జీడీపీ 150 బిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. పోర్టు చాలా ప్రాముఖ్యం క‌లిగి ఉండి, ఈశాన్య ప్రాంతానికి వాణిజ్య హ‌బ్‌గా ఉంది. ఈ న‌గ‌ర జ‌నాభా 50 ల‌క్ష‌ల పైబ‌డే. తూర్పు భార‌త‌దేశంలో అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యం క‌లిగిన ఏకైక న‌గ‌రం కోల్‌క‌త‌. ఉక్కు, భారీ ఇంజినీరింగ్‌, గ‌నులు, ఖ‌నిజాలు, సిమెంట్, ఔష‌ధాలు, ఆహార త‌యారీ, వ్య‌వ‌సాయం, విద్యుత్ ప‌రిక‌రాలు, వ‌స్త్రాలు, జ‌నుము వంటి ప‌లు రంగాల‌కు, వ‌స్తువుల‌కు ఈ న‌గ‌రం ప్రాముఖ్య‌త గాంచింది. ఎన్నో బ‌హుళ జాతి కంపెనీల ప్ర‌ధాన కార్యాల‌యాలు కోల్‌క‌త‌లో ఉన్నాయి. ఇక్క‌డ ఐటీ రంగం 70 శాతం రేటుతో వృద్దిచెందుతుండ‌గా, ఎన్నో సెజ్‌ల విస్త‌ర‌ణ జ‌రుగుతోంది.

బెంగ‌ళూరు

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధానిగా ఉన్న‌టువంటి బెంగుళూరు న‌గ‌రం సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి చెందింది. 2000 సంవ‌త్స‌రం త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా ఎన్నో ఐటీ కంపెనీలు బెంగుళూరును అనువైన కేంద్రంగా ఎంచుకోసాగాయి. ఈ న‌గ‌ర జీడీపీ 83 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉండ‌గ‌ల‌దు. వ్య‌వ‌స్థాప‌కులు ఎంచుకునే న‌గ‌రాల్లో ప్ర‌పంచంలో తొలి ప‌ది స్థానాల్లో బెంగుళూరు స్థానం సంపాదించింది. దేశం నుంచి విదేశాల‌కు వెళ్లే ఎక్కువ శాతం ఐటీ ఇంజినీర్లు ఇక్క‌డి నుంచే వెళుతున్నారంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ న‌గ‌రం ప్ర‌ఖ్యాతిని అర్థం చేసుకోవ‌చ్చు.

హైద‌రాబాద్‌

ముత్యాల న‌గ‌రంగా ప్ర‌సిద్ది చెందిన హైద‌రాబాద్ న‌గ‌ర జీడీపీ దాదాపు 74 బిలియ‌న్ డాల‌ర్లు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద చ‌ల‌న చిత్ర నిర్మాణ కేంద్ర‌మైన రామోజీ ఫిలిం సిటీ ఇక్క‌డే ఉంది. 1990 ద‌శ‌కం త‌ర్వాత హైద‌ర‌బాద్‌లో ఐటీ, ఐటీ అనుబంధ కంపెనీలు ఇబ్బడిముబ్బ‌డిగా పెరిగాయి. బెంగుళూరు త‌ర్వాత హైద‌రాబాద్‌ను రెండో సిలికాన్ వ్యాలీగా అక్క‌డి ప్ర‌జ‌లు పిలుచుకుంటారు. ప‌ర్యాట‌క ప్ర‌పంచంలో హైద‌రాబాద్ న‌గ‌రానికి లోన్‌లీ ప్లానెట్ సంస్థ మూడో ర్యాంకును కేటాయించింది. ఈ న‌గ‌రంలో గూగుల్; అమెజాన్‌, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్ సంస్థ‌లు ఉన్నాయి. ప్ర‌పంచంలో ప్ర‌సిద్ది చెందిన ఫార్మా కంపెనీల ప్ర‌ధాన కార్యాల‌యాల‌తో విరాజిల్లుతూ జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతికెక్కింది.

చెన్నై

త‌మిళ‌నాడు రాజ‌ధాని అయిన చెన్నై న‌గ‌రం ద‌క్షిణ భార‌త‌దేశంలో ముఖ్య‌మైన పోర్టును క‌లిగి ఉంది.ఈ న‌గ‌ర జీడీపీ 66 బిలియ‌న్ డాల‌ర్లుచెన్నై న‌గ‌రం ఆటోమొబైల్; సాఫ్ట్‌వేర్ సేవ‌లు, మెడిక‌ల్ టూరిజం, హార్డ్‌వేర్ త‌యారీ రంగం, ఆర్థిక సేవ‌ల వంటి వాటిలో ముందంజ‌లో ఉంది.ఐటీ అనుబంధ సేవ‌ల ఎగుమ‌తుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది.దేశ ఎల‌క్ట్రానిక్ ఎగుమ‌తుల్లో స‌గ భాగం ఇక్క‌డ నుంచే అవుతున్నాయి.ఆటోమొబైల్ కంపెనీలు ఫోర్డ్‌; నిస్సాన్‌; బీఎండ‌బ్ల్యూ వంటి సంస్థ‌ల ప్ర‌ధాన కార్యాల‌యాలు ఇక్క‌డే ఉన్నాయి. అందుకే ఈ న‌గ‌రాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అంటారు.

అహ్మ‌దాబాద్‌

గుజ‌రాత్ రాష్ట్రంలో ఒక ముఖ్య న‌గ‌ర‌మైన అహ్మ‌దాబాద్ దేశంలో సంప‌ద విల‌సిల్లుతున్న న‌గ‌రాల్లో ఒక‌టి. ఇది ఏడో స్థానంలో ఉంటూ 64 బిలియ‌న్ డాల‌ర్ల జీడీపీతో ఉంది. అదానీ గ్రూప్‌; నిర్మా, అర్వింద్ మిల్స్‌, క్యాడిలా, టొరెంట్ ఫార్మాస్యుటిక‌ల్ష్ వంటి ప్ర‌ధాన సంస్థ‌లు ఇక్క‌డ ఉన్నాయి.ఎన్నో అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు అహ్మ‌దాబాద్ నిల‌యం. ప్ర‌ముఖ యాడ్ ఏజెన్సీ ముద్రా ఇక్క‌డి నుంచే ఆవిర్బ‌వించింది.జెమ్స్‌, జ్యువెల‌రీ ఎగుమ‌తులు దేశంలోనే అత్య‌ధికంగా ఇక్క‌డి నుంచే ఎగుమ‌తమ‌వుతుంటాయి.న‌రేంద్ర మోదీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ప‌శ్చిమ భార‌త‌దేశంలో ఒక ఆర్థిక కేంద్రంగా త‌యార‌యింది.

పుణె

మ‌హారాష్ట్రలో రెండో అతిపెద్ద మెట్రోపాలిట‌న్ న‌గ‌ర‌మైన పుణె జీడీపీ 48 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది.గ‌త ద‌శాబ్ద కాలంగా చాలా ఆటోమొబైల్ కంపెనీలు, ఐటీ సంస్థ‌లు పుణెను కేంద్రంగా ఎంచుకుంటున్నాయి.ఆహార‌, కూర‌గాయాల ప్రాసెసింగ్ యూనిట్ల‌ను నెల‌కొల్ప‌డం ద్వారా పుణె ఫుడ్ క్ల‌స్ట‌ర్‌ను త‌యారుచేసేందుకు ప్ర‌పంచ‌బ్యాంకు పెట్టుబ‌డులు పెడుతోంది.250 పైగా జ‌ర్మ‌నీ కంపెనీలు పుణెలో త‌మ కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేసుకున్నాయి.

సూర‌త్‌

సూర‌త్ న‌గర జీడీపీ 40 బిలియ‌న్ డాల‌ర్లు 2020 క‌ల్లా 57 బిలియ‌న్ డాల‌ర్ల‌ను చేరుకోగ‌ల‌ద‌ని ఆ న‌గ‌ర మేయ‌ర్ అంచ‌నా.ప్ర‌పంచ డైమండ్ హ‌బ్ అని సూర‌త్‌కు పేరు ప్ర‌పంచంలో క‌ఠిన‌మైన డైమండ్ల‌లో 90 శాతం ఇక్క‌డే క‌టింగ్‌కు వ‌స్తాయి. పాలిషింగ్ త‌ర్వాత ఎగుమ‌తి అవుతాయి. టెక్స్‌టైల్స్‌కు ఎంతో ప్ర‌సిద్ది పొందిన ఈ న‌గ‌రం 380కి పైగా డైయింగ్‌, ప్రింటింగ్ మిల్స్‌ను క‌లిగి ఉంది. 40 వేల‌కు పైగా ప‌వ‌ర్‌లూమ్స్ ఉన్నాయి
2001 నుంచి 10 సంవ‌త్స‌రాల‌లో ఈ న‌గ‌ర జ‌నాభా రెండింత‌ల‌యింది.

విశాఖ ప‌ట్నం

వైజాగ్‌గా అంద‌రి నోట ప్ర‌సిద్ది పొందిన విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర జీడీపీ 26 బిలియ‌న్ డాల‌ర్లు దేశంలోనే పురాత‌న షిప్‌యార్డ్ ఉంది. పోర్ట్ నుంచి చాలా ఎగుమ‌తులు అవుతాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అతి పెద్ద న‌గ‌రం విశాఖ ప‌ట్న‌మే. ఇక్క‌డ గెయిల్‌, విశాఖ ఉక్కు, హిందూస్తాన్ పెట్రోలియం చ‌మురు శుద్ది క‌ర్మాగారం ఉన్నాయి. ఐటీ రంగం కూడా ఇక్క‌డ రెండో ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ది కొర‌కు విశాఖ‌ప‌ట్నంలో ఒక ప్ర‌త్యేక ఆర్థిక జోన్‌ను ప్ర‌భుత్వం నెల‌కొల్పింది.

Unknown
2nd డిబేట్‌లో పేలిన తూటాలు: మారిన మనిషిని, అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో భాగంగా హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో రెండో డిబేట్ ప్రారంభమైంది. ఈ డిబేట్‌లో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో హిల్లరీ వ్యక్తిగత జీవితంపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 12 ఏళ్ల బాలికపై బిల్ క్లింటన్ అత్యాచారానికి పాల్పడ్డారని, అయినా హిల్లరీ నోరు మెదపలేదని ఆరోపించారు. బిల్ క్లింటన్ మహిళలకు చేసిన అన్యాయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
గతేడాది ప్రభుత్వ విధానాల వల్లే ద్రవ్యలోటు అమాంతం పెరిగిందని ఒబామా ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు కల్పించడంలో హిల్లరీ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎప్పుడో 11 ఏళ్ల క్రితం తాను మాట్లాడిన మాటలను తెరపైకి తేవడం మంచిది కాదన్నారు. మహిళలను తానెప్పుడూ అవమానించలేదని, మహిళలంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు. తాను మారిన మనిషినని ట్రంప్ పేర్కొన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ సమాధానం చెప్పాలని ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే హిల్లరీ జైలు కెళ్లడం ఖాయమని అన్నారు. ఈ-మెయిల్ లీక్‌పై హిల్లరీ మరోసారి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తాను గెలిస్తే ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తానని హామీ ఇచ్చారు. 39వేల ఈమెయిల్స్ లీకైనప్పటికీ తప్పు జరగలేదనడం హిల్లరీ పేర్కొనడం దారుణమని ట్రంప్ అన్నారు. తనని క్షమాపణలు అడిగే హక్కు హిల్లరీకి లేదన్నారు. తనకు రష్యాతో గానీ, పుతిన్ గానీ ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ మహిళలను ట్రంప్ తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు మహిళలపై ఆయనకున్న గౌరవాన్ని బయటపెట్టాయని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడు కాదనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమీ ఉండదన్నారు. ట్రంప్ వ్యక్తిత్వమెంటో ఆడియోల్లో బయటపడిందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి అమెరికా ప్రతీక అని ఆమె స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఒబామాపై ట్రంప్ దారుణమైన వ్యాఖ్యలు చేశారని హిల్లరీ అన్నారు. ట్రంప్ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొన్నారు. అమెరికన్లు ఇస్లాంతో యుద్ధం చేయడం లేదన్నారు.
ఈ మెయిల్స్ లీక్‌లో తన తప్పు ఉందని, అందుకు గాను గతంలోనే తాను క్షమాపణలు చెప్పానని హిల్లరీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను అమెరికా ప్రజలందరి తరుపున ప్రెసిడెంట్‌గా పనిచేస్తానని తెలిపారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుస్తానని అన్నారు. అమెరికా సైనికుల త్యాగాలను ట్రంప్ కించపరచడం తగదని అన్నారు. పుతిన్‌తో ఎలాంటి సంబంధాలు లేకపోతే ట్రంప్‌ను ఎందుకు సమర్ధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. మొదటి డిబేట్‌లో హిల్లరీదే పైచేయి: మొదటి డిబేట్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ పైచేయి సాధించిన నేపథ్యంలో రెండో డిబేట్‌పై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. హిల్లరీ సీక్రెట్ ఈమెయిల్స్, కన్న కూతురిపై ట్రంప్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యం తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో జరగుతునున్న ఈ డిబేట్ ఆసక్తి రేపుతోంది. ఈ డిబేట్‌కు మోడరేటర్‌గా సీఎన్ఎన్ ప్రతినిధి ఆండ్రూసన్ కూపర్ వ్యవహరించారు. ఈ డిబేట్‌లో నిర్దిష్టమైన అంశం అంటూ ఏమీ లేదు. దీనిని రెండు భాగాలుగా విభజించారు. గతంలో టౌన్‌హాల్ జరిగిన డిబేట్ మాదిరే తరహాలో సాగనుంది. మొదటి భాగంలో ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు ట్రంప్, హిల్లరీలు సమాధానం చెబుతారు. తర్వాతి భాగంలో మోడరేటర్ ప్రశ్నలు సంధిస్తారు.



Unknown
పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ కమిడయన్ ఫృధ్వీపై పోలీస్ కేసు

హైదరాబాద్: తెలుగులో స్టార్ కమిడయన్ గా వెలుగుతున్న పృథ్విపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పృథ్వి తనను వివాహం చేసుకుని మోసం చేశాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై 498ఏ, 420 సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రస్తుతం బిజీ క‌మెడియ‌న్‌గా వెలుగొందుతున్నపృథ్వీ 30 ఇయర్ ఇండస్ట్రీ డైలాగ్‌తో సూప‌ర్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇండ‌స్ట్రీ తొలి ద‌శ‌లో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ హాస్యనటుడు ప్రస్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.
ఈ మధ్యకాలంలో బ్రహ్మనందం తర్వత అంతాలా క్రేజ్ తెచ్చుకున్న నటుడు పృద్వి. మెన్నటి లౌక్యం నుండి రీసెంట్ గా వచ్చిన జక్కన్న వరకూ వైవిధ్యమైన స్పూఫ్ లతో ఆకట్టుకున్నారు. ప్రభాస్ బహుబలి సినిమాను దాదాపు నాలుగు సినిమాలలో స్ఫూఫ్ గా చేయగా ...శ్రీమంతుడు కూడా అదే స్థాయిలో స్పూఫ్ లకు ఎగబాకింది. కాకపోతే ఇందులో విశేషం ఎమిటంటే, ఈ సినిమాల స్పుఫ్ లలో ఎక్కువగా నటించి మెప్పించింది మాత్రం ధర్టి ఇయిర్స్ ఇండస్ట్రీ పృద్వియే కావటం విశేషం. బాహుబలి లో శివలింగాన్ని ఎత్తిన సీన్ ను అనుకరించడంలో తనకు సాటి ఎవరు లేగని నిరుపించిన ఫృధ్వి.... భలే మంచి రోజు సినిమాలో కూడా పోలీస్ సినిమాల్లో డైలాగులు వరస పెట్టి చెప్పాడు. అంతేకాదు... మహేష్ శ్రీమంతుడు సునిమాలో డైలాగ్స్ అచ్చంగా దించి ఆడియన్స్ చేత ఈలలు వేయించాడు దియోటర్స్ లో. శంకరాభరణం సినిమాలో కూడా శ్రీమంతుడు డైలాగు చెప్పి విజిల్స్ వేయించాడు. సౌఖ్యం సినిమాలో అయితే పూర్తిగా స్ఫూఫ్ ల మీదే నడిపే ప్రయత్నం చేసారు. ఇదే రీతిలో సప్తగిరి, షకలక శంకర్ కూడా వారి స్థాయిలో స్ఫూఫ్ లు చేసి వారు మెప్పించారు.


Unknown