జాతీయ సెలక్టర్లకు బీసీసీఐ ఆహ్వానం
ముంబయి: సీనియర్, జూనియర్, మహిళల విభాగంలో జాతీయ సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. భారత జట్టు తరఫున టెస్టు, వన్డే మ్యాచుల్లో గాని భారత్లో 50కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లను ఆడిన క్రికెటర్లు ఈ పోస్టులకు అర్హులు.బీసీసీఐలో జాతీయ సెలక్టర్గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న అభ్యర్థులు నిబంధనల ప్రకారం అర్హులు కాదు. ఐపీఎల్, ఇతర మేనేజ్మెంట్ సంస్థలతో పాటు ప్రపంచంలోని ఏ ఇతర లీగ్ల్లో భాగస్వామ్యం కాకూడదు. తదితర వివరాలతో కూడిన బయోడేటాను పూర్తి చేసి ఈనెల 14లోపు ముంబయిలోని బీసీసీఐ కార్యాలయ చిరునామాకు గాని, మెయిల్ మెయిల్ రూపంలో దరఖాస్తులను పంపవచ్చని పేర్కొంది.జాతీయ సెలక్టర్లకు బీసీసీఐ ఆహ్వానం
Unknown
Saturday 10 September 2016